అక్టోబర్‌ నుండి కొత్త రూల్స్..అవి ఏంటంటే ?

Telugu Vidhya
2 Min Read

అక్టోబర్‌ నుండి కొత్త రూల్స్..అవి ఏంటంటే 

రెండు మూడు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగియనుంది. త్వరలో అక్టోబర్ నెల ప్రారంభమవుతుంది. నెల మొదటి రోజు నుండి అనేక ఆర్థిక నియమాలు మారుతాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అక్టోబర్ నెల నుండి ఏ ఆర్థిక నియమాలు మారబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

1. గ్యాస్ సిలిండర్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎల్‌పిజి సిలిండర్ ధర ప్రతి నెలా మొదటి తేదీన మారుతుంది. దేశీయ సిలిండర్లు, వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు అప్‌డేట్ చేస్తాయి. సెప్టెంబర్‌లో చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచాయి.

2. షేర్ బైబ్యాక్

మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ స్టాక్ మార్కెట్ క్రెడిట్ నిబంధనలను మార్చింది. కాగా, ఈ నిబంధన అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి రానున్నది. కొత్త నిబంధనల ప్రకారం..ఇప్పుడు షేర్లు 2 రోజుల్లో డీమ్యాట్ ఖాతాలో జమ చేయబడతాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లు రికార్డు తేదీ నుండి రెండు రోజుల్లో బోనస్ షేర్లను పొందుతారు.

3. సుకన్య సమృద్ధి యోజన

మీ కుమార్తె పేరు మీద మీకు సుకన్య ఖాతా ఉంటే..అక్టోబర్ 1, 2024 నుండి దాని నియమాలు మారనున్నాయి. తాతలు ఎవరైనా సుకన్య ఖాతాను తెరిచి ఉంటే ఆ ఖాతాను తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు మీద బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, సుకన్య అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేయకుంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.

4. పీపీఎఫ్ నిబంధనలలో మార్పులు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం..ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలు ఉంటే చర్యలు తీసుకుంటారు. అదే సమయంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఖాతాదారులకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాపై వడ్డీ ఉండదు. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత వడ్డీ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *